News July 2, 2024
తొక్కిసలాటలో 116 మంది మృతి.. కారణమిదే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719934222283-normal-WIFI.webp)
UPలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లి 116 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. బాబా పాదాల వద్ద ఉన్న పవిత్ర మట్టి, జలాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలినట్లు సమాచారం. మృతుల్లో అమాయక మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.
Similar News
News July 5, 2024
చిన్ననాటి కోచ్తో కోహ్లీ.. ఫొటోలు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164111524-normal-WIFI.webp)
ముంబైలో టీ20 వరల్డ్కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
News July 5, 2024
అసలు కథ అంతా సీక్వెల్లోనే: నాగ్ అశ్విన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720154020072-normal-WIFI.webp)
‘కల్కి 2898ఏడీ’ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీం యాస్కిన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్లోనే ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఆ ముగ్గురి మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలక పాత్ర పోషించనుంది. సీక్వెల్కు సంబంధించి నెల రోజులు షూట్ చేశాం. బాగా వచ్చింది. ఇంకా తీయాల్సి ఉంది. వీటిలో భారీ యాక్షన్ సీక్వెన్సులుంటాయి’ అని పేర్కొన్నారు.
News July 5, 2024
కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720172099507-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్ను పొడిగించింది.