News January 1, 2025
హైదరాబాద్లో 1184 డ్రంక్&డ్రైవ్ కేసులు

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 20, 2026
సింగరేణి అంతర్గత నియామకాలు.. ముగిసిన రాత పరీక్షలు

సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి గురువారం అంతర్గత రాత పరీక్షలు ముగిశాయి. రెండు శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుల కోసం మొత్తం 104 మంది దరఖాస్తు చేసుకోగా, 92 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా, మూడు డంప్ మెన్/ట్రిప్ మెన్ పోస్టుల భర్తీకి పది మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 9 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు.
News February 20, 2026
సింగరేణి అంతర్గత నియామకాలు.. ముగిసిన రాత పరీక్షలు

సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి గురువారం అంతర్గత రాత పరీక్షలు ముగిశాయి. రెండు శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుల కోసం మొత్తం 104 మంది దరఖాస్తు చేసుకోగా, 92 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా, మూడు డంప్ మెన్/ట్రిప్ మెన్ పోస్టుల భర్తీకి పది మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 9 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు.
News February 20, 2026
మహబూబ్నగర్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మహబూబ్నగర్ నుంచి రాజ్కోట్కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 09576 గల ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల 3న మహబూబ్నగర్లో బయలుదేరి జడ్చర్ల, షాద్నగర్, ఉందానగర్, కాచిగూడ స్టేషన్ల మీదుగా రాజ్కోట్కు చేరుకుంటుందని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, అదనపు రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.


