News April 10, 2024
12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ

ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్కు చేరుకుంటుదన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.
Similar News
News March 24, 2025
ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చి దిద్దాలి: లోకేశ్

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం మంత్రి లోకేశ్ సమక్షంలో GNU, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్నారు.
News March 24, 2025
రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం.. మీ కామెంట్

రాజకీయ చైతన్యం గల చిలకలూరిపేటలో పాలిటిక్స్ వేడెక్కాయి. నియోజకవర్గంలో బలమైన నేతయిన మర్రి రాజశేఖర్ TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు TDPలో చక్రం తిప్పిన సీనియర్ లీడర్, MLA పత్తిపాటి పుల్లారావు స్పందనెలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటు ప్రతిపక్షం నుంచి విడదల రజినీ బలంగా YCP గొంతు వినిపిస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి, మర్రి వర్సెస్ రజినీగా రాజకీయం రసవత్తరంగా మారింది.
News March 24, 2025
తాడేపల్లి: మహిళ హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండ వద్ద మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన ప్రాంతాన్ని ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు ఎస్పీ వెంట ఉన్నారు.