News October 23, 2024

12వ బెటాలియన్‌లో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

image

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ దళం అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో ఆరుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. రికార్డు పర్మిషన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్నెపర్తి బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు, బంధువులు అద్దంకి-NKP రహదారిపై రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులను గుర్తించిన పోలీసులు ఆరుగురు సిబ్బందిపై వేటు వేశారు.

Similar News

News March 11, 2025

NLG: 20 వరకు ప్రవేశానికి దరఖాస్తులు

image

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 11, 2025

నల్గొండ: ‘పరువు హత్యలు ఇకనైనా ఆగాలి!’

image

2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రణయ్ హత్య తర్వాత జరిగిన పరువు హత్యలు చర్చకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని భువనగిరిలో రామకృష్ణను, ఇటీవలే సూర్యాపేటలో మాల బంటిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News March 11, 2025

ప్రణయ్ హత్య కేసులో వెనకడుగు వేయని పీపీ ‘దర్శనం నరసింహ’

image

2018లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును వాదించడానికి అప్పట్లో లాయర్లు వెనకడుగు వేశారు. సీనియర్ న్యాయవాది దర్శనం నరసింహ ఈ కేసును వాదించడానికి ముందుకు వచ్చారు. దీంతో ప్రణయ్ తండ్రి పెరుమాండ్ల బాలస్వామి అభ్యర్థన మేర జిల్లా కలెక్టర్ 2019లో ఈ కేసును వాదించడానికి దర్శనం నరసింహను స్పెషల్ పీపీగా నియమించారు. ఈ కేసు తీర్పు సోమవారం వెలువడి ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది.

error: Content is protected !!