News April 10, 2024
12న ఈవీఎంల రాండమైజేషన్: కలెక్టర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బందితో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాండమైజేషన్ ప్రక్రియపై ఆయన వారికి అవగాహన కల్పించారు.
Similar News
News October 5, 2025
సినీనటి శ్రీరెడ్డికి బొమ్మూరు పోలీసుల నోటీసు

సినీనటి శ్రీరెడ్డికి బొమ్మూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ రమేశ్ శనివారం 35 బీఎన్ఎస్ బెయిల్ నోటీసును జారీ చేశారు. గత ఏడాది నవంబరు 12న టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం కింద శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ వెళ్తున్న శ్రీరెడ్డికి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఎస్ఐ ఈ నోటీసులు అందజేశారు.
News October 5, 2025
రాజమండ్రి: తిరుపతి విమాన సర్వీస్కు విశేష స్పందన

రాజమండ్రి నుంచి తిరుపతికి కొత్తగా ప్రారంభించిన విమాన సర్వీస్కు విశేష స్పందన లభించింది. తాజాగా వచ్చిన తిరుపతి సర్వీస్లో రెండు రోజుల్లోనే 211 మంది ప్రయాణించారు. మొదటి రోజు రాజమండ్రి నుంచి 66, రెండో రోజు 67 మంది వెళ్లగా.. తిరుపతి నుంచి మొదటి రోజు 38, రెండో రోజు 40 మంది ప్రయాణించినట్లు అలయన్స్ ఎయిర్లైన్స్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
News October 4, 2025
రాజమండ్రి: 6న స్కూల్ గేమ్స్ సెలక్షన్స్: DEO

ఉమ్మడి తూ.గో జిల్లా స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ను ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు తెలిపారు. ఫుట్బాల్ అండర్-14, కరాటే అండర్-14, 17 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు పీఈటీలు ఎ.వి.డి. ప్రసాదరావు, వి. భువనేశ్వరిని సంప్రదించాలని డీఈవో కోరారు.