News March 18, 2025
12 నుంచి 4 వరకు బయటకు రావొద్దు : ADB కలెక్టర్

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావాలని సూచించారు. బయటకు వెళితే వెళ్లినప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ 4 నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
ADB: రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో మనోళ్లకే మొదటి స్థానం

ADBలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలో “ఆరు గ్యారంటీల అమలుకు అవకాశాలు: ADBపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేగం వారిని అభినందించారు.
News March 19, 2025
ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒక గంజాయిని పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News March 19, 2025
ADB: ఉపాధి పని ప్రదేశంలో వాటర్ బెల్

వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులు చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓను ఆదేశించినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో రక్షణ కల్పించేందుకు ఉపాధి పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీలకు గంటకోసారి నీళ్ళు తాగేలా పని ప్రదేశంలో చర్యలు తీసుకోవాలన్నారు.