News December 24, 2024
12 నెలలకు వేతనాలు ఇప్పించాలని కోదండరాంకు విజ్ఞప్తి
ప్రభుత్వ పాఠశాలల్లో SSA ఆధ్వర్యంలో పని చేస్తున్న సిద్దిపేట జిల్లా ఒకేషనల్ సంఘం నేతలు MLC కోదండరాంను కలిశారు. తమకు 12 నెలలకు గాను వేతనం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోదండరాం.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో VTA రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, నవీన్, జ్ఞానేశ్వర్, వృత్తి విద్య అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News January 12, 2025
మెదక్: తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ
సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
News January 12, 2025
మెదక్: యువత వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ
భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎంపీ స్వామి వివేకానందకు నివాళులర్పించారు. లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు ఆగకండి.. అంటూ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద మహోన్నతమైన సందేశం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందరన్నారు.
News January 12, 2025
MDK: పండగకు పయాణం.. దొంగలతో జాగ్రత్త..!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీని అదనుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.