News July 5, 2024
14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720182220214-normal-WIFI.webp)
బిహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.
Similar News
News July 8, 2024
‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720441074436-normal-WIFI.webp)
TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.
News July 8, 2024
‘హరోమ్హర’లో ప్రణీత్.. క్షమాపణలు చెప్పిన హీరో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720435367091-normal-WIFI.webp)
పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ <<13586460>>ప్రణీత్<<>> హనుమంతు తన సినిమా ‘హరోమ్హర’లో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు తెలిపారు. చిత్రయూనిట్ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు X వేదికగా ప్రకటించారు. ఇతను ఇంతటి నీచమైన వ్యక్తి అని తమకు తెలియదని పేర్కొన్నారు. వీరి కామెంట్స్ ఏ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రావని స్పష్టం చేశారు.
News July 8, 2024
అలా అయితే రీ-నీట్కు ఆదేశిస్తాం: సుప్రీం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720439403731-normal-WIFI.webp)
నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.