News December 25, 2024

తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు

image

సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.

Similar News

News December 3, 2025

మలి దశ తొలి అమరుడా.. ‘నిను మరువబోదు ఈ గడ్డ’

image

తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తొచ్చేది అమరుల బలిదానాలే. స్వరాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం(2009)లో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి. చావు బతుకుల్లోనూ ‘బతికినా మళ్లీ తెలంగాణ కోసం చస్తా’ అన్న ఆయన వ్యాఖ్యలు కోట్లాది మందిలో ఉద్యమకాంక్షను రగిల్చాయి. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిప్పు కణికలై ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి.

News December 3, 2025

చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు అవుతున్నాయా?

image

ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్‌ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని టాడ్లర్స్‌ డయేరియా అంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థాలు, తీపి తగ్గించడంతో పాటు జింక్, ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్లు, విటమిన్‌–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అయినా తగ్గకపోతే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణం కావొచ్చు. దీనికి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

News December 3, 2025

గాన గంధర్వుడి విగ్రహంపై వివాదం.. మీరేమంటారు?

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును పలువురు <<18452414>>అడ్డుకోవడంపై<<>> నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్పీ బాలు ప్రాంతాలకు అతీతం అని, అలాంటి గొప్పవారి విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?