News December 25, 2024

తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు

image

సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.

Similar News

News December 30, 2025

Z: లోన్ తియ్.. ట్రిప్ వెయ్.. రిపీట్!

image

gen-Zలు గొప్పలకై అప్పులు చేస్తున్నారని హెల్తియన్స్ సర్వే వెల్లడించింది. 2025లో లోన్స్ తీసుకున్న 27% gen-Zల మెయిన్ రీజన్ ట్రిప్స్, కన్సర్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్. R2: కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్, బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. R3: ఫోన్స్, ల్యాపీ, స్మార్ట్ వాచ్ వంటి టెక్ థింగ్స్. ఇంకో ట్రెండ్.. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా టెక్కులు, సోకుల కోసం Zలు లోన్ సైకిల్‌లో తిరుగుతున్నారు.

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. మోదీ తీవ్ర ఆందోళన

image

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశారు. శాంతి నెలకొనాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు శాంతి యత్నాలను దెబ్బతీస్తాయన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. అయితే పుతిన్ నివాసంపై తాము దాడి చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు.

News December 30, 2025

అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.