News October 22, 2024
12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్
TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్స్లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News October 22, 2024
పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం.. దరఖాస్తుకు 3 రోజులే గడువు
పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్షిప్కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. DEC 2 నుంచి ఇంటర్న్షిప్ ప్రారంభిస్తారు.
News October 22, 2024
AI ఎఫెక్ట్.. ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల్లో కోత
ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ స్టాఫ్పై AI తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదేళ్లలో 1,100 మంది(60 శాతం)ని ఫోన్ పే తొలగించింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్థత పెరిగిందని ఫోన్ పే తన నివేదికలో పేర్కొంది. మరోవైపు కంపెనీ ఆదాయం పెంచుకుని నష్టాలనూ తగ్గించుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,085 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో రూ.5725 కోట్లకు చేరుకుంది.
News October 22, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్పై UPDATE
AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.