News October 22, 2024
12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్స్లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News January 12, 2026
ఫ్లెమింగో ఫెస్ట్: ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా.!

ఫ్లెమింగో ఫెస్టివల్లో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. హీరోయిన్లు ఆషికా, డింపుల్ అందాలు, హెబ్బా డాన్స్ ఫర్మామెన్స్ అదిరిపోయింది. సింగర్ హారిక పాటలకు ప్రేక్షకులు తెగ సందడి చేశారు. జదర్దస్త్ కమెడీయన్లు రాకేష్ దంపతులు, చంటి అలరించారు. మొత్తంగా రెండో రోజు కార్యక్రమాలు ‘ఈమాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా’ అన్నట్లు సాగాయి. మీరూ ఈవెంట్కు వెళ్లింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 12, 2026
దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.


