News December 17, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 62,112 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నారు.

Similar News

News November 22, 2025

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్‌వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్‌) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News November 22, 2025

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

image

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News November 22, 2025

నవజాత శిశువుల్లో మూర్ఛ

image

సాధారణంగా మూర్ఛ చిన్నవయసులో/ 60ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంటుంది. కానీ కొన్నిసార్లు నవజాత శిశువులకూ మూర్ఛ వస్తుందంటున్నారు నిపుణులు. దీన్నే నియోనాటల్ మూర్ఛ అంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎదుగుదల లోపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా లక్షలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. దీని సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి చిన్నారి కదలికలు అసాధారణంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.