News January 3, 2025

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జ‌న‌వ‌రి 10-19 వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్లడించింది.

Similar News

News December 29, 2025

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

image

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.

News December 29, 2025

డాక్యుమెంట్, ట్రైన్ చేసిన దండకారణ్య డాక్టర్

image

లొంగిపోయిన మావోయిస్టు చందు దండకారణ్య మిస్టరీ డాక్టర్ రఫీఖ్/మణిదీప్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ఈ డాక్టర్ కనీస సౌకర్యాలతోనే అడవిలో సర్జరీలూ చేశారు. మావోలు, ఆదివాసీలకు చేసే ప్రతి ట్రీట్మెంట్ డాక్యుమెంట్ చేసి దళానికి కాపీ ఇచ్చి, ప్రతి టీంలో అల్లోపతి, ఆయుర్వేదంలో రెగ్యులర్ ట్రీట్మెంట్ నేర్పారు. 2016లో దండకారణ్యం నుంచి ఝార్ఖండ్‌కు వెళ్లిన అతడి ఆచూకీ ఇంకా బయటకు తెలియదు.

News December 29, 2025

దేశవాళీ పండ్లు, కూరగాయల్లోనే అధిక పోషకాలు

image

గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరిగే దేశవాళీ పండ్లు(ఉసిరి, నేరేడు, పనస, ఈత, తాటి, మామిడి, వెలగ) కూరగాయలు(గుమ్మడి, దొండ, చిక్కుడు, మునగ, కర్రపెండలం, చిలగడదుంప, కంద, చామ మొదలైనవి), ఆకుకూరలు అధిక పోషకాలు, ఔషధ విలువలను కలిగి ఉంటాయి. హైబ్రీడ్ రకాలకంటే దేశవాళీ రకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అధికంగా పీచు పదార్థం, ఖనిజ లవణాలు, విటమినులు, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు అంది ఆరోగ్యం బాగుంటుంది.