News March 23, 2024
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.
Similar News
News February 8, 2026
బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.
News February 8, 2026
బ్రౌన్ షుగర్తో ఎన్నో లాభాలు

వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి, కేలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి.
News February 8, 2026
NEET (UG) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

దేశవ్యాప్తంగా UG మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET(UG) 2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో మే 3న ఈ పరీక్ష జరగనుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు ₹1700, EWS, OBC-NCL వారికి ₹1600, SC, ST, PwBD, థర్డ్ జెండర్ ₹1000, ఔట్ సైడ్ ఇండియా అభ్యర్థులకు ₹9500గా ఉంది.
వెబ్సైట్: <


