News September 27, 2024
12 కి.మీ ఛేజింగ్.. ఒకరి కాల్చివేత.. ₹60 లక్షలు స్వాధీనం

కేరళలోని త్రిసూర్లో 3 ATMలను లూటీ చేసి ₹60 లక్షలతో ఉడాయిస్తున్న హరియాణా ముఠాను తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఒక ట్రక్కులో TNలోకి ప్రవేశించిన ఈ ఏడుగురు సభ్యుల మూఠాను నమక్కల్ పోలీసులు 12KM ఛేజింగ్ చేశారు. వారు పోలీసులపై దాడి చేసి ఇద్దర్ని గాయపర్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముఠా సభ్యుడొకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ట్రక్కు, అందులోని కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 19, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 19, 2026
‘ధురంధర్’ విలన్ రోల్.. నో చెప్పిన నాగార్జున!

రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ మూవీలో విలన్ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే పాత్ర నచ్చినా అప్పటికే కూలీ, కుబేర సినిమాల్లో నటిస్తుండటంతో డేట్స్ను అడ్జస్ట్ చేయలేక నాగ్ ఆఫర్ను తిరస్కరించారని పేర్కొన్నాయి. దీంతో చివరకు అక్షయ్ ఖన్నాను సెలక్ట్ చేశారని వెల్లడించాయి.
News January 19, 2026
థైరాయిడ్ పేషంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియలు బాగుంటాయి. దీంట్లో హెచ్చుతగ్గులను సరిచేయడానికి మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అయోడిన్ ఉన్న ఉప్పు వాడటంతో పాటు చిక్కుళ్లు, బటానీలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, రాగిజావ, మిల్లెట్స్ తినాలని సూచిస్తున్నారు. ✍️ థైరాయిడ్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


