News May 24, 2024
లోక్సభ బరిలో 121 మంది నిరక్షరాస్యులు

దేశవ్యాప్తంగా లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 359 మంది ఐదో తరగతి వరకు, 647 మంది 8వ తరగతి వరకు, 1303 మంది 12వ తరగతి, 1502 మంది అభ్యర్థులు డిగ్రీ, 198 మంది అభ్యర్థులు డాక్టరేట్లు ఉన్నట్లు పేర్కొంది. పలువురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. కాగా మిగిలిన ఆరు, ఏడు దశల ఎన్నికలు మే 25, జూన్ 1 జరగనున్నాయి.
Similar News
News September 13, 2025
భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.
News September 13, 2025
షూటింగ్లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది: పవన్పై రోజా ఫైర్

AP: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను Dy.CM పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని YCP నేత రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పవన్ మద్దతివ్వడం దారుణమన్నారు. ‘ఆయనకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. Dy.CM స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారు. షూటింగ్లు చేసుకునేందుకు కాదు ప్రజలు ఆయనకు ఓట్లేసింది’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
News September 13, 2025
ఒత్తయిన కనుబొమ్మలకి ఈ చిట్కాలు

అందమైన, ఒత్తయిన కనుబొమ్మల కోసం అమ్మాయిలు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వారంలో రెండుసార్లు పెట్రోలియం జెల్లీని ఐబ్రోస్కి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి. మెంతిపిండిలో కొబ్బరినూనె కలిపి కనుబొమ్మలకు రాత్రి అప్లై చేసి, ఉదయం శుభ్రం చేసుకోవాలి. మెంతిలో ఉండే నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి.