News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 16, 2025

నగరంలో ఏటా సుమారు 3 వేల యాక్సిడెంట్స్!

image

HYDలో ఏటా స‌గ‌టున 3 వేల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయని, ఈ ప్ర‌మాదాల్లో 300 వ‌ర‌కు దుర్మరణం చెందుతున్నారని CP సజ్జనార్ అన్నారు. ఎల్బీస్టేడియంలో రోడ్ సేఫ్టీపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌ల‌పెట్టిన ARRIVE ALIVE కార్య‌క్ర‌మాన్ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డితో పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ అనేది ప్ర‌తి ఒక్కరు సామాజిక బాధ్య‌త‌లాగా తీసుకోవాలన్నారు.

News November 16, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షీ క్యాబ్స్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద దిగితే, అక్కడ నుంచి నగరానికి వెళ్లేందుకు ఇక మహిళలకు చాలా ఈజీ. ఏలాంటి భయం లేకుండా ఈజీగా ప్రయాణించవచ్చు. రాత్రింబవళ్లు 10 షీ క్యాబ్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సేవలను సుశిక్తులైన డ్రైవర్లు కండిషన్ క్యాబ్లతో కొనసాగిస్తున్నట్లు RGIA ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

News November 16, 2025

MBNR: రైల్వే ప్రతిపాదనలకు పచ్చజెండా

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు కురుమూర్తిలో ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు, గద్వాలలో రైళ్ల నిలుపుదల, ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి తదితర పనులు చేపట్టాలని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరికల్ మండలం పెద్దచింతకుంట వద్ద ఆర్‌యూబీ వద్ద రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు.