News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 20, 2025

చింతూరు: తవుడు బస్తాల మాటున గంజాయి రవాణా

image

చింతూరు మండలం ఎర్రంపేట సమీపంలో బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బొలెరో వాహనంలో క్రింద గంజాయి, పైన తవుడు బస్తాలు వేసి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన గంజాయి 120కిలోలు రూ.6లక్షలు ఉంటుందన్నారు. ఒరిస్సా మల్కాన్‌గిరికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

News November 20, 2025

Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

image

‘ఆపరేషన్ సిందూర్‌’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.

News November 20, 2025

సింగపూర్‌కి ప్రభుత్వ టీచర్లు పయనం.. ఏం చేయబోతున్నారంటే.?

image

సింగపూర్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు APకి చెందిన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సిద్ధమైంది. వీరు NOV 27-DEC 2 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, బోధనా పద్ధతులను వీరు పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు వీరు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ బృందం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పయనం కానుంది.