News March 20, 2025
125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 5, 2025
MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్లు!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.
News December 5, 2025
ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్ఛార్జ్ PO సమావేశం

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


