News March 20, 2025
125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
నెల్లూరు జిల్లాలో పెరిగిన పంట నష్టం..!

దిత్వా తుఫానుతో నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా బోగోల్, బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు,సంగం, అల్లూరు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 116 హెక్టార్లలో నర్సరీ దశలో, 507 హెక్టార్లలో సాగులో ఉన్న వరిపంట దెబ్బతింది. ఇందుకు సంబంధించి 439 మంది రైతులు నష్ట పోయారు. మొంథా తుఫానుతో ఇటీవల చేతికందే దశలో పంట దెబ్బతినగా.. మరోసారి దిత్వా తుఫాన్తో మరోసారి రైతులకు నష్టం వాటిల్లింది.
News December 3, 2025
మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 3, 2025
ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.


