News December 10, 2024
13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.
Similar News
News January 17, 2025
హెల్మెట్ వినియోగం తప్పనిసరి: కలెక్టర్
జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ సమీక్షించింది.
News January 17, 2025
VJA: అమిత్షా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలి
కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశించారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
News January 17, 2025
జగ్గయ్యపేటలో దారుణ హత్య
జగ్గయ్యపేటలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆంజనేయులు గతంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా పని చేశారు. గతంలో ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో సామినేని ఉదయభాను తొలగించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.