News December 7, 2024
‘13న రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం’

ఉమ్మడి అనంత జిల్లాలో రైతుల సమస్యలపై ఈనెల 13న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్నట్లు కళ్యాణదుర్గం YCP ఇన్ఛార్జ్ తలారి రంగయ్య తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 12, 2025
గుంతకల్లులో యువకుడి దారుణ హత్య

గుంతకల్లులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆదర్శ నగర్లో తాగునీటి కొళాయి వద్ద నీటి కోసం మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ అనే యువకుడిపై మరో వ్యక్తి వేట కొడవలితో దాడిచేసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News December 12, 2025
టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్గా ఎన్నిక

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.
News December 11, 2025
BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్గా గౌతమి

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


