News September 10, 2024
13-04-2029: భూమికి అత్యంత సమీపానికి భారీ గ్రహశకలం

అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తోన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది. దీనిని ఈజిప్ట్ దేవుడు ‘అపోపిస్’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు. 2029 ఏప్రిల్ 13న భూమికి కేవలం 32,000 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం 340-450 మీటర్ల వ్యాసం ఉంటుందని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దదైన గ్రహశకలం ఢీకొడితే ఓ ఖండం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


