News August 2, 2024
విదేశాల్లో 13 లక్షల మంది ఉన్నత విద్య

2024లో ఇప్పటి వరకు 108 దేశాల్లో 13.35 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి కీర్తివర్ధన్ వెల్లడించింది. అత్యధికంగా కెనడాలో 4.37 లక్షలు, USలో 3.37 లక్షలు, చైనాలో 8,580, ఉక్రెయిన్లో 2,150, ఇజ్రాయెల్లో 900, పాక్లో 14 మంది చదువుతున్నారని రాజ్యసభలో తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు భారత ఎంబసీల్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో-9ను జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కాగా జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
News October 16, 2025
పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్స్ వాడుతున్నారా?

ప్రస్తుతకాలంలో చాలామంది పీరియడ్స్ పోస్ట్పోన్ చేసే టాబ్లెట్లు వాడుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో గర్భస్థ శిశువుకి జననేంద్రియ లోపాలు రావచ్చంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే మహిళలు వీటిని వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే డాక్టర్ సలహా మేరకు వాడడం మంచిదని సూచిస్తున్నారు.
News October 16, 2025
ఈ నెల 23న ఉద్యోగ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో 10 MNC కంపెనీలు పాల్గొననున్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ అర్హతలు గల అభ్యర్థులు హాజరుకావొచ్చు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.