News November 21, 2024

13 నెలల యుద్ధం.. 44,056 మరణాలు: పాలస్తీనా

image

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 13 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గాజాలో 44,056 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు ప్రకటించారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు. శిథిలాల కిందే వేలాది మృతదేహాలు సమాధి అయ్యాయని, తాము ప్రకటించిన దానికంటే మరణాలు ఎక్కువే ఉండొచ్చని వెల్లడించారు. అలాగే 1,04,268 మంది గాయపడ్డారన్నారు. మరోవైపు 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

Similar News

News February 14, 2026

NCPల విలీనం జరగదు: సంజయ్ రౌత్

image

మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ NCP, శరద్ పవార్ NCPల <<19010034>>విలీనం<<>> లేనట్లేనని శివసేన(UBT) MP సంజయ్ రౌత్ వెల్లడించారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవార్ తనతో చెప్పారన్నారు. దీనిపై మహా వికాస్ అఘాడీలోని 3 పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఆయన 60 ఏళ్లుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఛాతీ నొప్పితో ఇటీవల ఆస్పత్రిలో చేరిన పవార్ ఇవాళ డిశ్ఛార్జ్ అయ్యారు.

News February 14, 2026

పడమర దిశలో ఇల్లు ఉండకూడదా?

image

పశ్చిమాన గృహ నిర్మాణం మంచిది కాదని చాలామంది అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అవగాహన లోపంతో ప్రసారమయ్యే అవాస్తవాలను నమ్మకూడదు అంటున్నారు. ‘పడమర దిశకు వరుణుడు అధిపతి. వరుణుడు చల్లగా చూస్తే పాడిపంటలకు లోటుండదు. ఆహ్లాదం, ఆనందం కలిగించే ఆ దేవుడి దిశలో ఇల్లు కట్టుకుంటే ధనరాసులతో కళకళలాడే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 14, 2026

మార్చి నుంచి చకచకా ‘వాహన్’ సేవలు

image

TG: వాహన యజమానులకు అందించే సేవలు మెరుగుపర్చేలా ప్రభుత్వం మార్చిలో ‘వాహన్‘ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, ఫీజుల చెల్లింపు, చిరునామాల మార్పు వంటి ఆన్‌లైన్ సేవలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ‘సారథి’ పోర్టల్‌లోని సర్వీసులు దీనిలోనూ ఉంటాయి. ప్రస్తుతం SEC, HYD RTOలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.