News April 28, 2024
నాగోల్-చాంద్రాయణగుట్ట రూట్లో 13 స్టేషన్లు

HYD నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే మెట్రో మార్గంలో 13 స్టేషన్లు రానున్నాయి. న్యూ నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, LBనగర్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్, కర్మన్ఘాట్, చంపాపేట, ఒవైసీ ఆస్పత్రి, DRDO, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లు రానున్నాయి. నాగోల్లో ఇప్పుడున్న స్టేషన్ నుంచి కొత్తగా నిర్మించే రూట్లోని స్టేషన్ను కలిపేలా స్కైవాక్ను నిర్మిస్తారు.
Similar News
News October 17, 2025
భారత్ మౌనంగా ఉండదు: మోదీ

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 17, 2025
తిన్న వెంటనే నడుస్తున్నారా?

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it
News October 17, 2025
మంత్రి లోకేశ్పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.