News April 29, 2024
1300-1400 ఎకరాల్లో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు..?

డోర్నకల్- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్సీపీ-104 నుంచి ప్రారంభించి డోర్నకల్ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.
Similar News
News February 17, 2026
ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 16, 2026
ఏపీ నుంచి ఇసుక రవాణాపై ఖమ్మం సీపీ హెచ్చరిక

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలన్నారు. అక్రమ రవాణా, నిల్వలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని తెలిపారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
News February 16, 2026
అధికారులతో ఖమ్మం కలెక్టర్ సమీక్ష

ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, రబీ ధాన్యం సేకరణ, తాగునీటి సరఫరా, రోడ్డు భద్రతపై అధికారులతో కలెక్టర్ అనుదీప్ సమీక్షించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండి వసతులు మెరుగుపరచాలని, నిర్లక్ష్యం సహించబోమన్నారు. వేసవిలో మిషన్ భగీరథ ద్వారా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలన్నారు.


