News April 3, 2024
13000 మంది ఉద్యోగులతో జీరో రీ పోల్ సాధ్యం: కలెక్టర్

జిల్లాలోని 13000 ఎన్నికల సిబ్బంది ఎన్నికల రోజూ బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే జీరో రీ పోల్ సాధ్యమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలను రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 21, 2025
మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News November 21, 2025
వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News November 21, 2025
GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.


