News March 16, 2024
వైసీపీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు

AP: వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.
Similar News
News November 1, 2025
ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్కు అవకాశం దక్కేలా కోటా విధించారు.
News November 1, 2025
ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News November 1, 2025
ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.


