News April 3, 2024
132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలి: సీఎండీ

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు 16 జిల్లాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఎస్ఏఓలు, డివిజినల్ ఇంజినీర్లతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడారు. 132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు .
Similar News
News March 16, 2026
స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్మాల్

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.
News March 16, 2026
WGL: సింహపురి ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

వరంగల్-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
News March 15, 2026
జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.


