News March 3, 2025
13,400 మంది విద్యార్థులకు.. ఉ.9 నుంచి పరీక్ష

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. నంద్యాల జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 13,400 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
Similar News
News March 23, 2025
మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
News March 23, 2025
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, HYD తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
News March 23, 2025
మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్ 26,98,668 స్కోర్తో టాప్లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్లో ఉంది.