News June 29, 2024

శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్

image

సైబర్ స్కామ్‌కు పాల్డడ్డారనే ఆరోపణలతో 137 మంది భారతీయులను శ్రీలంక అరెస్ట్ చేసింది. కొలంబోలోని మడివేలా, బత్తరముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరందరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెట్టింగ్, జూదం, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్, అఫ్గానిస్థాన్‌లోనూ వీరు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

Similar News

News July 1, 2024

తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

image

* హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
* కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
* భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
* ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
* గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
* భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
* ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
* వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి

News July 1, 2024

NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు: రాహుల్

image

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

News July 1, 2024

వీరి మధ్య నిలబడటం గర్వంగా ఉంది: నాగ్

image

‘కల్కీ’ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘‘పదేళ్ల క్రితం స్వప్న దత్, ప్రియాంక దత్‌, నేను కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. ఆ చిత్రం రిస్క్‌తో కూడుకుంది. అదనపు ఖర్చు ఆందోళనకు గురిచేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మేము చేసిన ప్రతి సినిమా విజయం పొందడంతో పాటు మైలురాయిగా నిలిచాయి. వీరి మధ్య నిలబడటం గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా’’ అని తెలిపారు.