News October 12, 2024
14న అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు మహబూబ్ నగర్ క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా Way2Newsతో మాట్లాడుతూ.. ఈనెల 14న ఎండీసీఏ మైదానంలో ఎంపికలు నిర్వహిస్తామని,ఆసక్తిగల క్రీడాకారులు జనన ధ్రువీకరణ,ఆధార్ కార్డు,తెల్లటి క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు.
Similar News
News November 18, 2025
MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.


