News September 8, 2024
14న జమ్మూలో ప్రధాని ఎన్నికల ప్రచారం

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జమ్మూలో ప్రధాని మోదీ ప్రచారం ఆరంభించనున్నారు. ఆ రోజు పలు సభల్లో ఆయన పాల్గొంటారు. దీంతో మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో(ఈ నెల 18, 25, అక్టోబర్ 1) పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్గా భక్తులను ఆకర్షిస్తోంది.
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.


