News August 9, 2024

140 కోట్ల జనాభా.. గోల్డ్ మెడల్ ఏది?

image

140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈసారి విశ్వక్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆఖరికి పాకిస్థాన్ కూడా స్వర్ణం సాధించిందని, మనకేం తక్కువని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు క్రికెట్‌తో పాటు ఇతర ఆటలను తప్పకుండా ప్రోత్సహించాలని కోరుతున్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండొద్దని, కులం, మతం, ప్రాంతం కాకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 6, 2025

ఉపాధి కూలీలకు ₹6,434 కోట్లు బకాయి పడిన కేంద్రం

image

MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.

News February 6, 2025

రుణం కంటే రెట్టింపు వసూలు.. విజయ్ మాల్యా పిటిషన్

image

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.

News February 6, 2025

ఎండాకాలం వచ్చేసింది

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరిగింది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది అదేరోజు 13,276 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు ఉంటున్నాయి. మరో వారంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

error: Content is protected !!