News November 19, 2024

ఒకే కుటుంబంలో 140 మంది డాక్టర్లు

image

ఢిల్లీకి చెందిన ఓ కుటుంబంలో ఇప్పటివరకు 140 మంది డాక్టర్లుగా పనిచేశారు. 1920లో సభర్వాల్ ఫ్యామిలీలో తొలిసారిగా బోధిరాజ్ వైద్య వృత్తి స్వీకరించారు. ఆ తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వైద్య విద్య అభ్యసించారు. మెడిసిన్ చదివిన అమ్మాయినే ఆ కుటుంబంలోని వారు పెళ్లి చేసుకుంటున్నారు. ఒక కోడలు బయోకెమిస్ట్ చదవగా అమెతో మళ్లీ మెడిసిన్ చదివించారు. ప్రస్తుతం వీరికి ఢిల్లీలో 5 ఆస్పత్రులు ఉన్నాయి.

Similar News

News November 28, 2025

తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్‌షిప్

image

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్‌షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కోరారు. ఈ టౌన్‌షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.

News November 28, 2025

WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

image

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు

News November 28, 2025

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలుగా, మడకశిర, బనగానపల్లె, నక్కపల్లి, అద్దంకి, పీలేరును రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.