News June 28, 2024
ఈజిప్టులో వెలుగుచూసిన 1400 మమ్మీలు!

సుమారు 1400 మమ్మీలున్న 36 సమాధుల్ని పరిశోధకులు ఈజిప్టులో తాజాగా గుర్తించారు. ఇవి లభ్యమైన ప్రాంతాన్ని ‘అస్వాన్’గా పిలుస్తున్నారు. నైలు నదికి తూర్పు తీరంలో 2.70 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం కనీసం 4500 ఏళ్ల క్రితం నాటిదని, అంటురోగాలు సోకిన వారిని ఇలా సామూహికంగా ఖననం చేసి ఉంటారని భావిస్తున్నారు. వీటిని గుర్తించేందుకు ఐదేళ్ల పాటు శ్రమించినట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు.
Similar News
News April 9, 2026
ఈనెల 15 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్

అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. పహల్గామ్, బాల్తాల్ మార్గాలకు ఈ రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపింది. 13ఏళ్ల లోపు, 70ఏళ్లు పైబడిన వారికి అనుమతి లేదు. <
News April 9, 2026
75% పోలింగ్.. అదరగొడుతున్న అస్సాం ఓటర్లు!

అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అస్సాంలో 75.91% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేరళంలో 62.71%, పుదుచ్చేరిలో 72.40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్లోకి ఎంట్రీ ఉంది. కాగా 2021 ఎన్నికల్లో అస్సాంలో 82.42%, కేరళంలో 74.06%, పుదుచ్చేరిలో 83.42% పోలింగ్ నమోదైంది.
News April 9, 2026
సైంధవుడిలా అడ్డుకోవడమంటే?

ఎవరైనా ఓ పనిని ముందుకు సాగనీయకపోతే సైంధవుడిలా అడ్డుకున్నాడని అంటాం. దుర్యోధనుడి సోదరి దుస్సల భర్తే సైంధవుడు(జయద్రథుడు). వనవాసంలో ద్రౌపదిని అతను అవమానిస్తే భీముడు చావగొడతారు. ఆ పగతో తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను అడ్డగించేలా శివుడిని వరం కోరతారు. అర్జునుడిని మినహాయించి ఈశ్వరుడు ఈ వరమిస్తారు. యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లాక ఇతర పాండవులు అనుసరించకుండా సైంధవుడు అడ్డుపడతారు.
<<-se>>#EPICSAYINGS<<>>


