News February 17, 2025
1,427 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించాం: జగదీశ్వర్

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్కూల్ ఐస్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ములుగు ఆరోగ్యశాఖ కార్యాలయంలో విద్యార్థులకు ఐస్క్రీనింగ్ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న విద్యార్థులను గుర్తించేందుకు రోజుకు 100 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు వివిధ పాఠశాలలకు చెందిన 1,427 మంది పిల్లలకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
Similar News
News April 16, 2026
శ్రీకాకుళం: సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులు సూచించారు. రీ వెరిఫికేషన్ కు సైతం 20 వ తేదీ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 16, 2026
RR: మండుతున్న ఎండలు.. ఇవి తప్పనిసరి

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీంతో డీ హైడ్రేషన్కు లోనయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి తెలిపారు. సాధ్యమైనంత వరకు మ.12 గం. నుంచి 4 వరకు బయట తిరగక పోవడమే ఉత్తమమని, అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు
News April 16, 2026
నల్గొండ: పునర్విభజనపై గుత్తా ఆశలు

నియోజకవర్గాల పునర్విభజన వార్తలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఏడాది నవంబరుతో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుండటంతో, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న అంచనాల మధ్య నకిరేకల్, మిర్యాలగూడ లేదా నల్గొండ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.


