News March 13, 2025
14405 టోల్ ఫ్రీపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నాటు సారా సంబంధిత ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించి సారారహిత జిల్లాగా పార్వతీపురం మన్యంకు గుర్తింపు తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. గురువారం ఇందుకు సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. పోలీసులు నాటు సారా గ్రామాలను దత్తత తీసుకోవాలని అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంగా విస్తృత దాడులు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 21, 2025
ALERT: కడప జిల్లాకు వర్ష సూచన

కడప జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడప జిల్లాలతో పాటు అల్లూరి, మన్యం, నంద్యాల, పల్నాడు(D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
News March 21, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News March 21, 2025
పార్వతీపురం: బావిలో మృత్యదేహం .. UPDATE

పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్లే దారిలో నర్సిపురం బావిలో సత్యనారాయణ మృతదేహాం కనిపించిన విషయం తెలిసిందే. అయితే సారక వీధికి చెందిన అతను రెండు రోజుల నుంచి కనిపించలేదని గురువారం మృతదేహమై కనిపించాడని కుటుంబీకులు తెలిపారు. మృతుని భార్య పార్వతీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు.