News February 12, 2025
15న అమరచింతకు జాన్ వెస్లీ రాక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357345591_52070028-normal-WIFI.webp)
అమరచింతకు ఈనెల 15న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నట్లు ఆత్మకూరు సీపీఐ(ఏం) మండల కార్యదర్శి ఎస్ రాజు పేర్కొన్నారు. అమరచింతలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అభినందన సభ ఉంటుందన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ నూతన సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739403468659_19090094-normal-WIFI.webp)
అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.
News February 13, 2025
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: ఆలూరు సాంబ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363550877_51349305-normal-WIFI.webp)
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
News February 13, 2025
వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739410376991_710-normal-WIFI.webp)
ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.