News March 17, 2025

15రోజుల ముందే వార్షిక ఉత్పత్తి సాధించింది: జీఎం

image

రామగుండం సింగరేణి సంస్థ RG-1 2024- 25 సంవత్సరానికి 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 15 రోజుల ముందే సాధించిందని GM లలిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా OCP-5 ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, అధికారులు, యూనియన్ నాయకులు, సూపర్వైజర్లకు ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

Similar News

News March 17, 2025

కృష్ణా: నేడు ‘మీకోసం’ కార్యక్రమం 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. 

News March 17, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 17, 2025

గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

image

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

error: Content is protected !!