News October 29, 2025

15వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం: సీఎండీ

image

విశాఖ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల 11 జిల్లాల్లో 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 80 జేసీబీలు, 115 క్రేన్లు, 254 డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు.

Similar News

News October 29, 2025

అన్నమయ్య: యువతిని మోసం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

image

యువతిని మోసం చేసిన వ్యక్తికి కడప 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బుధవారం జీవిత ఖైదుతోపాటు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. ఆ వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రైల్వే కోడూరు మండలం రెడ్దివారిపల్లికి చెందిన గొంతు సుబ్రమణ్యం, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని మోసం చేశాడు. దీంతో ఆ బాదితురాలు 2022లో కోడూరు పోలీసులని ఆశ్రయించగా నేడు శిక్ష పడింది.

News October 29, 2025

వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

image

వరంగల్ జిల్లా మొత్తాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. జిల్లాలో కేవలం ఒక్కరోజులో (ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు) 1245.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేట (143.8 మి.మీ), నెక్కొండ (143.7 మి.మీ), పర్వతగిరి (130.5 మి.మీ), రాయపర్తి (115.3 మి.మీ) మండలాల్లో కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

News October 29, 2025

HYD: మంత్రి దృష్టికి సబ్సిడీ మీటర్ల సమస్య!

image

రజక, నాయి బ్రాహ్మణుల 250 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన సబ్సిడీ మీటర్లను తొలగించడంపై ప్రభుత్వం వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ HYD బీసీ ప్రధాన కార్యదర్శి రంజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల మీటర్లను డిస్కనెక్ట్ చేయడం, మీటర్లు ఉంటే కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తామని GHMC అధికారులు నోటీసులిస్తున్నట్లు తెలిపారు. దీనిని త్వరలో మంత్రి పొన్నం ప్రభాకరుకూ విన్నపించనున్నారు.