News March 14, 2025
15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
Similar News
News December 13, 2025
పెద్దపల్లి జోన్లో సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జోన్లోని అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.


