News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News April 5, 2026
VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News April 5, 2026
ఉమ్మడి జిల్లాలో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేడు పర్యటన

రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారని జిల్లా సమాచార శాఖ శనివారం తెలిపింది.
News April 5, 2026
ఉమ్మడి జిల్లాలో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేడు పర్యటన

రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారని జిల్లా సమాచార శాఖ శనివారం తెలిపింది.


