News March 29, 2024
15 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు: యువ ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. 2019లో 85.02% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. 2024లో వంద శాతం నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు.
Similar News
News February 7, 2026
చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.
News February 6, 2026
పుంగనూరు TDP ఇన్ఛార్జ్ మార్పుపై కసరత్తు..?

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదుర్కోవడంలో TDP ఇన్ఛార్జ్ చల్లా బాబు విఫలం అవుతున్నారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. కూటమి అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం YCPదే పవరంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం వద్ద వాపోయారట. పెద్దిరెడ్డితో చల్లా లోపాయికారి ఒప్పందాలతో క్యాడర్ నష్టపోతుందని, ఇందుకు చెక్ పెట్టాలని ఓవర్గం హైకమాండ్ను కోరినట్లు సమాచారం. అధిష్ఠానం సైతం ఇన్ఛార్జ్ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
News February 6, 2026
చిత్తూరు: హస్తం పార్టీ మళ్లీ పుంజుకునేనా.?

జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే. కేంద్ర మాజీ మంత్రి చింతా, స్థానిక నేతలు ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నా ఆ ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తిరుగుతున్నారు. రఘువీరారెడ్డి వంటి నేతలు నాయకులలో నూతనోత్సాహం నింపేలా ప్రయత్నిస్తున్నారు. మరి మళ్లీ హస్తం పార్టీ జెండా ఎగురుతుందా.?


