News April 4, 2026
15 చోట్ల కల్తీ పాలు..!

కల్తీ పాల నివారణకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో పశు సంవర్ధక, ఫుడ్ సేఫ్టీ విభాగాలు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 705 పాల నమూనాలను పరీక్షించగా, 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు టి.శ్రీనివాస రావు, కె.సుప్రియ వెల్లడించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని తెలిపారు.
Similar News
News April 5, 2026
కొవ్వూరు: కరెంటు షాక్తో రైతు మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు హైవే రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పొలంలో కరెంటు తీగలు తెగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుడు పసివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీను(60)గా గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.
News April 5, 2026
దండంగి కొండలపై పులి సంచారం

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.
News April 5, 2026
ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


