News September 10, 2025
15 నుంచి మంచిర్యాలలో వందేభారత్ హాల్టింగ్

వందేభారత్ రైలు సికింద్రాబాద్- నాగపూర్, పెద్దపల్లి జంక్షన్ మీదుగా మంచిర్యాలలో నిలుపుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల నెల 15న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆవరణలో రైలు ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు.
Similar News
News September 10, 2025
నిర్మల్: మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా లావణ్య

నిర్మల్ జిల్లాకు చెందిన బి.లావణ్యను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఛైర్మన్ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 10, 2025
ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం!

C.P. రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికలో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే.
News September 10, 2025
SC కార్పోరేషన్ నిధుల దుర్వినియోగం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

ED సంతకం ఫోర్జరీ చేసి ఏలూరు జిల్లా SC కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసిన జూనియర్ అసిస్టెంట్ పవన్కుమార్ను కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్డ్రా చేసిన అతను 2019 నుంచి రూ.70 లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల నిధుల దుర్వినియోగంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారని కలెక్టర్ స్పష్టం చేశారు.