News February 10, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 15గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,536 మంది దర్శించుకోగా, 25,890 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News November 27, 2025

మిరపలో బూడిద తెగులు – నివారణ

image

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News November 27, 2025

ఏకగ్రీవం.. ఒకే కుటుంబం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులు

image

TG: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉంది. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అలాగే ఆదిలాబాద్(D) తేజాపూర్‌లో కోవ రాజేశ్వర్, సిరిసిల్ల(D) రూప్లానాయక్ తండాలో రూప్లానాయక్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News November 27, 2025

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్‌ హీటర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలు ఆడుకునే చోట.. హీటర్​తో నీళ్లను వేడిచేయకూడదు. బాత్‌రూమ్‌లో పెడితే అక్కడ తడిగా ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఇమ్మర్షన్ రాడ్‌ పూర్తిగా నీటిలో మునిగిన తరవాతనే.. స్విఛ్‌ ఆన్ చెయ్యాలి. మెటల్ బకెట్‌లో పెట్టవద్దు. తడి చేతులతో, తడి బట్టలతో ముట్టుకోకూడదు.