News February 10, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 15గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,536 మంది దర్శించుకోగా, 25,890 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News December 14, 2025

కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

image

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.

News December 14, 2025

డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం

News December 14, 2025

మూవీ ముచ్చట్లు

image

* బిగ్ బాస్ తెలుగు సీజన్-9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్. ఇవాళ మరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్!
* ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్(జనవరి 9)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్
* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ టీజర్ ఈ నెల 18న విడుదల.. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమా