News August 11, 2024

8 ఏళ్లలోనే 15 ఒలింపిక్ పతకాలు: పురందీశ్వరి

image

కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశానికి ఒలింపిక్ పతకాల సంఖ్య పెరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అన్నారు. 1952 నుంచి 2012 వరకు ఇండియాకు 20 మెడల్స్ వస్తే 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్లలోనే 15 పతకాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, TOPS ద్వారా కేంద్రం అథ్లెట్లకు సపోర్ట్ చేస్తోందని వివరించారు.

Similar News

News December 5, 2025

వాస్తు అంటే ఏమిటి? దాని పాత్ర ఏంటి?

image

వాస్తు అనేది ఇంటిని వాస్తవాలకు అనుగుణంగా అమర్చే శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘ప్రతి మనిషికి అత్యవసరమైన సుఖం, సంతోషం, తృప్తి ఒక నివాసంలో లభించాలి. వాస్తు నియమాలు ఈ ఆశయాలను చేరుకోవడానికి సరైన దిశను సూచిస్తాయి. ఇవి ఇల్లు నిర్మాణంలో, సర్దుబాటులో నియమాలను పాటించేలా చేసి, మన జీవితంలో సాఫల్యాన్ని, మంచి ఫలితాలను అందిస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 5, 2025

బిగ్గెస్ట్ డీల్: నెట్‌ఫ్లిక్స్ సొంతమైన ‘Warner Bros’

image

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే భారీ డీల్ అమల్లోకి వచ్చింది. Warner Bros టెలివిజన్ స్టూడియోస్, HBO, HBO MAXలను $82.7bn(₹7.44L Cr)కు కొనుగోలు చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఒక్కో షేర్‌ను $27.75గా లెక్కగట్టినట్లు పేర్కొంది. ఈ డీల్ 2026 Q3లో పూర్తవుతుందని తెలిపింది. దీంతో లక్షల గంటల WB కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో దొరకనుంది. ప్రపంచాన్ని ఎంటర్‌టైన్ చేయడమే తమ లక్ష్యమని సంస్థ co-CEO సరండోస్ అన్నారు.

News December 5, 2025

రాష్ట్రపతి భవన్‌కు పుతిన్.. ఘన స్వాగతం

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించడం గమనార్హం.