News August 11, 2024

8 ఏళ్లలోనే 15 ఒలింపిక్ పతకాలు: పురందీశ్వరి

image

కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశానికి ఒలింపిక్ పతకాల సంఖ్య పెరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అన్నారు. 1952 నుంచి 2012 వరకు ఇండియాకు 20 మెడల్స్ వస్తే 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్లలోనే 15 పతకాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, TOPS ద్వారా కేంద్రం అథ్లెట్లకు సపోర్ట్ చేస్తోందని వివరించారు.

Similar News

News February 3, 2026

అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం

image

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.

News February 3, 2026

పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.

News February 3, 2026

సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకోవాలో తెలుసా?

image

వేసవిలోనే కాదు అన్ని సీజన్లలోనూ బయటకు వెళ్లేటప్పుడు చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. రెగ్యులర్ యూసేజ్‌కు SPF 30 PA(ప్రొటెక్షన్ గ్రేడ్) ఉన్న ప్రొడక్ట్‌ వాడుకోవచ్చు. ఎండలో తిరిగే వాళ్లు SPF 60/అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్ ఉపయోగించాలి. ముఖం, మెడకు కలిపి 1/4 టీ స్పూన్ క్రీమ్ రాసుకోవాలి. లోషన్ వాడటమే కాదు, ఎంత పరిమాణం రాసుకుంటున్నామనేదీ ముఖ్యమే.