News March 7, 2025
ఒక్కో చిన్నారి రూ.5 లక్షలకు విక్రయం.. 15 మంది అరెస్ట్

HYDలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్కు చెందిన వందన తన ముఠాతో కలిసి పిల్లల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రులు, రోడ్లపై చెత్త ఏరుకునే పిల్లల్ని అపహరించడం, బీద తల్లిదండ్రుల నుంచి ₹2.5LK-₹3.5Lకు కొనుగోలు చేసి ఒక్కో చిన్నారిని ₹5Lకు పిల్లలు లేని వారికి అమ్మినట్లు గుర్తించారు. వందనను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.
Similar News
News October 26, 2025
దేశం పరువును గంగలో కలిపారు.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

MPలో ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని, దేశం పరువును గంగలో కలిపారని అధికార BJPపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. CM బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తోందని BJP కౌంటర్ ఇచ్చింది. నిందితుడిపై తక్షణ చర్యలు చేపట్టామని, ఇలాంటి వాటిని సహించేదే లేదని స్పష్టం చేసింది.
News October 26, 2025
వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్లు సిద్ధం చేశామన్నారు.
News October 26, 2025
కరూర్ బాధితులను కలవనున్న విజయ్

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.


