News November 18, 2024
3Hrs నిలబెట్టి 15 మంది ర్యాగింగ్.. విద్యార్థి మృతి

గుజరాత్లోని ధార్పూర్ GMERS మెడికల్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. థర్డ్ ఇయర్ సీనియర్స్ 15 మంది ఇంట్రో పేరుతో ఫస్ట్ఇయర్ స్టూడెంట్ అనిల్ మెథానియాను ర్యాగింగ్ చేశారు. ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టారు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 3 గంటలు నిలబెట్టిన విషయాన్ని పోలీసులు రికార్డు చేసుకున్న కాసేపటికే అతడు మరణించడం సంచలనంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News October 31, 2025
VIRAL: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్ను నెటిజన్లు గంభీర్తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
News October 31, 2025
తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారా..?

హిందూ సంప్రదాయం ప్రకారం.. అసుర సంధ్యా వేళలో ‘చారణులు’ అనే దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో మనం ఏం మాట్లాడినా వారు ‘తథాస్తు’ అని దీవిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే సాయంకాలం చెడు మాటలు మాట్లాడొద్దని మన పెద్దలు చెబుతుంటారు. మట్లాడేటప్పుడు తొలుత మనం చెడు మాట పలికితే.. ఆ దేవతలు పూర్తి మాట వినకుండా ఆ మొదటి మాటకే ‘తథాస్తు’ అనేస్తారట. అందుకే సాయంత్రం వేళ మంచి మాత్రమే మాట్లాడాలి.
News October 31, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్లో 30 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అహ్మదాబాద్లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్సైట్: https://www.prl.res.in/


