News November 18, 2024

3Hrs నిలబెట్టి 15 మంది ర్యాగింగ్.. విద్యార్థి మృతి

image

గుజరాత్‌లోని ధార్పూర్ GMERS మెడికల్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. థర్డ్ ఇయర్ సీనియర్స్ 15 మంది ఇంట్రో పేరుతో ఫస్ట్ఇయర్ స్టూడెంట్‌ అనిల్ మెథానియాను ర్యాగింగ్ చేశారు. ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టారు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 3 గంటలు నిలబెట్టిన విషయాన్ని పోలీసులు రికార్డు చేసుకున్న కాసేపటికే అతడు మరణించడం సంచలనంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 22, 2025

తిరిగి ప్రారంభమైన దక్షిణ ప్రాకారం విస్తరణ పనులు

image

వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ ప్రాకారం విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. కాగా, భారీ బహుబలి యంత్రంతో రోడ్డుపై రంధ్రాలు చేసేందుకు ప్రయత్నించగా, రోడ్డు వెడల్పుపై స్పష్టత కోరుతూ స్థానికులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, ఇతర అధికారులు స్థానికులకు స్పష్టతనిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దీంతో పనులు పున: ప్రారంభమయ్యాృయి.

News November 22, 2025

నట్స్‌తో బెనిఫిట్స్: వైద్యులు

image

నిత్యం స్నాక్స్‌గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్‌ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.

News November 22, 2025

రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్‌

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్‌, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్‌ ఫ్రీజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.