News September 22, 2024
వారి అకౌంట్లలో రూ.15వేలు జమ: కేంద్రమంత్రి

బడ్జెట్లో ప్రకటించినట్లుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని EPF అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈమేరకు గరిష్ఠంగా ఒక ఉద్యోగికి రూ.15వేలు అందనుంది. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96లక్షల మంది చందాదారులు, 4.54లక్షల మంది పెన్షన్ తీసుకునేవారున్నట్లు కేంద్రమంత్రి HYDలోని PF కార్యాలయంలో తెలిపారు.
Similar News
News February 1, 2026
సంగమేశ్వర జాతరకు సర్వం సిద్ధం చేయండి: జడ్పీ సీఈఓ

ప్రసిద్ధ శైవ క్షేత్రం కేతకీ సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జడ్పీ సీఈఓ జానకి రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, క్యూలైన్లు వంటి మౌలిక వసతుల్లో లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్దదైన ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
News February 1, 2026
పశువులకు పోషకాలను అందించే అవిశ

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News February 1, 2026
మాఘ పౌర్ణమి విశిష్టత

పురాణాల ప్రకారం.. ఈరోజే గౌరీ దేవి జన్మించింది. అలాగే శ్రీమహావిష్ణువు స్వయంగా గంగానదిలో కొలువై ఉంటాడని నమ్మకం. ఈరోజున సముద్రంలో లేదా పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పవిత్రమైన నీటితో స్నానం చేస్తూ విష్ణువును, సూర్య భగవానుడిని స్మరించుకోవాలని సూచిస్తున్నారు. పితృదేవతలకు తర్పణాలు వదిలితే దోషాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని మాఘ పురాణం చెబుతోంది.


