News April 24, 2024
రాష్ట్రంలో రూ.155 కోట్లు స్వాధీనం

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ.61.77 కోట్ల నగదు, రూ.19.16 కోట్లు విలువ చేసే నగలు, రూ.28.92 కోట్ల విలువైన మద్యంతో పాటు రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.
News January 8, 2026
భారీ జీతంతో నీతిఆయోగ్లో ఉద్యోగాలు

<
News January 8, 2026
రూ.26.30 కోట్ల ఫ్లాట్ కొన్న రోహిత్ భార్య

రోహిత్ శర్మ భార్య రితికా ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 2,760sq ft. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు చెల్లించారు. ప్రస్తుతం హిట్మ్యాన్ దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ దంపతులు కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.


