News April 24, 2024
రాష్ట్రంలో రూ.155 కోట్లు స్వాధీనం

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ.61.77 కోట్ల నగదు, రూ.19.16 కోట్లు విలువ చేసే నగలు, రూ.28.92 కోట్ల విలువైన మద్యంతో పాటు రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.
News October 24, 2025
రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.
News October 24, 2025
340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


