News September 14, 2025

16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. 15న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Similar News

News September 14, 2025

ఎటెండెన్స్‌లో VZM ఎంపీకి ఫస్ట్ ర్యాంక్

image

లోక్ సభలో ఎంపీల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎంపీలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, ఎటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లను ఇచ్చింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్వశ్చన్స్, ఎటెండెన్స్‌ కేటగిరీల్లో తొలిస్థానంలో నిలిచారు. ఓవరాల్ ర్యాంక్‌‌లో ఫోర్త్ ప్లేస్ వచ్చింది.

News September 14, 2025

‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

image

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.

News September 14, 2025

అమలాపురం ఎంపీకి 4వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో అమలాపురం ఎంపీ గంటి హరీశ్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 77 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 98.35గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.